నువ్వులు, ఆవాలు, విదంగాల ను సమ భాగాలుగా తీసుకుని విడి విడిగా వేయించి పొడిచేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చెంచా చొప్పున సాయంత్రం రాయడం వలన అలెర్జీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
లేత వేపాకులు, తులసి ఆకులు సమానంగా తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటికి నీటిని చేర్చి నూరి రసం తీసుకోవాలి. 30.మి.లీ. పరిమాణంలో ఈ రసాన్ని తాగితే చర్మంపై వచ్చే అలర్జీ తగ్గుముఖం పడుతుంది.
రెంసీదు చెంచాల సుగంధి పాల చూర్ణానికి గ్లాసు నీటిని కలిపి సగం అయ్యేవరకు మరిగించాలి. ఈ కషాయాన్ని వడబోసి తాగాలి నెల నుంచి రెండు నెల్లలపాటు ఇలాచేస్తే అలర్జీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
పసుపు కొమ్ములు అరగదీసి, ఆ గంధాన్ని పూతగా వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజూ నువ్వులు లేదా ఆవనూనే ఒంటికి రాసుకుని, అరగంట తరువాత స్నానం చేయాలి. అలర్జీలు దరిచేరకుండా అదుపులో ఉంటాయి.
లేత వేపాకుల ముద్దను పసుపు, నువ్వుల నూనె కలిపి సమస్య ఉన్నచోట లేపనంలా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.